21 June 2011

రేపు ఉదయం హన్మకొండలో జయశంకర్ అంత్యక్రియలు

                                                                 
తెరాసా  సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ (76) మంగళవారం ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ఐతే ఆయన కోరిక మేరకు ఆయన నివాసానికి మొన్ననే  ఆయన్ని తరలించారు.1969 తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చురుకుగా పాల్గొన్నారు.1979 -1981 మధ్య కాలం లో  ఆయన కాకతీయ విశ్వవిద్యాలయ  రిజిష్ట్రార్‌గా పనిచేశారు.తెరాసా ఆవిర్భావం లో ,సిద్ధాంతాలలో ఆయన కృషి మరవలేనిది.
 
ప్రొఫెసర్ జయశంకర్ అంత్యక్రియలు రేపు ఉదయం హన్మకొండలో జరుగుతాయి. ప్రజలు,అభిమానుల  సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని ఏకశిల పార్క్ లో ఉంచారు,అక్కడి నుంచి రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఆయన మృతితో తెలంగాణవాదులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Telangana issue

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us