02 June 2011

జగన్ ని అసమర్దుడిగా నిలపెట్టడమే బాబు ఉద్దేశమా ???

ఎట్టకేలకు అవిశ్వాస తీర్మానం కోసం తెలుగుదేశం పార్టీ ఇవాళ  సాయంత్రం  అసెంబ్లీ లో నోటిసు ఇచ్చింది .అవిశ్వాసం ప్రవేశ పెట్టె విషయమ్మీద
చంద్రబాబు మాట్లాడుతూ తాము అధికారం కోసం ఈ తీర్మానాన్ని ప్రవేశ పట్టడం లేదని ,రైతు వ్యతిరేఖ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన
అవసరముందని ,ఈ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయిందని .
తాము ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానం కేవలం ప్రభుత్వ అసమర్థతను తెలియజెప్పడానికే ఉపయోగపడుతుందని అని అంటున్న బాబు ఉద్దేశం నిజంగా అదేనా???
ఖచ్చితంగా కానే కాదు అవిశ్వాస తీర్మానం పెట్టడంలో  బాబు చతురత కనపడుతుంది.జగన్ ని అసమర్దుడిగా ప్రజల ముందు నిలపెట్టడమే బాబు ఉద్దేశమా  ???
"జగన్ కన్నెర చేస్తే ప్రభుత్వం కూలి పోతుంది కదా ..కన్నెర్ర చెయ్యమని  కోరుతున్నా" అని మహానాడు వేదికగా బాబు జగన్ ని ఉద్దేశించి అన్న మాట గుర్తు చేసుకుంటే  బాబు  వ్యుహమేమిటో       అర్ధమవుతుంది. ఒక్క ఎమ్మెల్యే తో ఎలా కూల్చగలమని జగన్ స్వయంగా అనటమే బాబు తెగింపుకి  కారణం . అసలు జగన్ బలమేంటో
బాబు తేల్చేద్దామని నిర్ణయించుకున్నారు.తీర్మానం వీగిపోయినా టిడిపి కి వోచే నష్టమేమీ ఉండదు .మరి జగన్ తన సామర్ధ్యం చూపిస్తాడో లేక చతికలు పడతాడో వేచి చూడాలి

ఐతే అసెంబ్లీ సమావేశాలు జరగడానికి చాలా ముందే టిడిపి నోటిసు ఇవ్వడం తో అది చెల్లుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది.

  

T.D.P, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us