31 May 2011

యూపీఏ మీద దుమ్మెత్తిపోసిన సుష్మ

కేంద్రంలో, రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణా రాష్ట్రం రాదని భారతీయజనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. కరీంనగర్ లో తెలంగాణా పోరు సభలో ఆమె మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే తెలంగాణా ఇస్తామని హామీ ఇచ్చారు. 
తెలంగాణా కోసం భాజపా చిత్తశుద్ధితో నిరంతరం పోరాడుతోందని తెలిపారు. తెలంగాణా ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపేందుకే తాను వచ్చానని, పార్లమెంటులో యూపీఎ తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.తెలంగాణా ఇవ్వకుండా, తాత్సారం చేసేందుకు కేంద్రంలోని యూపీఎ ప్రభుత్వం  కమిటీని వేసి తెలంగాణా ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణా కోసం 600 మంది తెలంగాణా బిడ్డలు ఆత్మబలిదానం చేసారని అయినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదని  మన్మోహన్ ది చేతకాని ప్రభుత్వమని  యూపీఏ సర్కార్ మీద సుష్మ దుమ్మెత్తిపోశారు .తాము అధికారం లోకి  రాగానే తెలంగాణా ఇచ్చి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.

B.J.P

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us