|

‘ముందు ప్రజలను వోటు వేయనివ్వండి. ప్రజలు నిర్ణయించినప్పుడు వారి అభిప్రాయం ప్రకారం నడుచుకుంటాను. వారు నన్ను అభిమానిస్తున్నారు కనుక నాకు వోటు వేస్తున్నారు. అది వారి నిర్ణయం. వారికి నమ్మక ద్రోహం చేయజాలను. నేను వారిని వంచించలేను. ఈ దఫా వారు దీనిని కోరుకుంటున్నారు. కొన్ని సార్లు ప్రజల నిర్ణయాన్ని మన్నించవలసి ఉంటుంది’ అని ఆమె చెప్పారు.
మరి మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా అన్నప్పుడు, ప్రజ లే నిర్ణయిస్తారని తన అభిప్రాయమని, అది వోట్లపై ఆధారపడి ఉంటుందని, మెజారిటీ వచ్చినప్పుడు సిఎంను అవుతానని మమత సమాధానం ఇచ్చారు.
మరి కాంగ్రెస్ సంగతేమిటని, ఆ పార్టీ పునరుత్థానం సాధ్యమేనని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మమత సమాధానం ఇస్తూ, తాము పూర్తి మద్దతు ఇస్తున్నందున వారు ఎన్నికలలో గెలుస్తారని అన్నారు.

0 comments:
Post a Comment