28 April 2011

గాలి జనార్థన్‌తో వై.ఎస్. జగన్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎర్రం

మాజీ ఎంపీ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రన్నాయుడు విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే మాటలను ఎవరూ విశ్వసించబోరని ఎర్రన్నాయుడు అన్నారు.
వై.ఎస్. జగన్‌కు గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఓటేస్తే దాన్ని బురదలో వేసినట్లేనని ఎర్రం వెల్లడించారు. కడప లోక్‌సభ స్థానంలో జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడం ఖాయమని ఎర్రం జోస్యం చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోకసభ స్థానంలో ప్రచారం చేస్తారన్నారు

T.D.P, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us