28 April 2011

నైతికత గురించి మాట్లాడే హక్కు లేదు: అంబటి రాంబాబు

కాంగ్రెస్ పార్టీ నేతలకు నైతిక గురించి మాట్లాడే హక్కు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నైతికత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల నేతలకు లేదన్నారు.
వైఎస్.జగన్ వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరిగితే అనైతికతమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన చిరంజీవి మాట్లాడితే నైతికతా అంటూ ఆయన సూటిగా అడిగారు. విజయమ్మను ఢిల్లీ పిలిపించి సోనియాగాంధీ చేసింది ఏమి లేదన్నారు. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబునాయుడేనని అంబటి అన్నారు.

YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us