12 April 2011

హరీశ్ వ్యాఖ్యలపై మండిపడ్డ గోనె

కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే తెలంగాణ నేతలను ద్రోహులుగా ప్రకటిస్తామన్న సిద్ధిపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఫత్వాలు జారీ చేయటం హరీశ్‌రావు మానుకోవాలని హితవు పలికారు.

ఆయన మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ కుటుంబ ఆధిపత్య పోరులో ముందు ఉన్నానని చెప్పుకోవటానికే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్య తీసుకోలేదని గోనె ప్రశ్నించారు. కడప, పులివెందుల్లో ప్రచారానికి వెళతామని ఆయన స్పష్టం చేశారు.

T.R.S, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us