18 April 2011

జగన్‌వి అక్రమాస్తులా..? ఎవరు చూశారు..?: కేసీఆర్ ప్రశ్న

దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని పలువురు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేసీఆర్ కొట్టిపారేశారు. జగన్‌కు ఉన్న ఆస్తిపాస్తులు అక్రమంగా వచ్చాయని చెప్పేందుకు ఆధారాలేమైనా ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు.

ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారం చేయడం కొంతమంది నాయకుల పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సంపాదించిన ఆస్తి అక్రమంగా వచ్చిందని రుజువు చేసే సాక్ష్యాలేమైనా ఉంటే బహిర్గతం చేసి తర్వాత మాట్లాడాలన్నారు. అంతేతప్ప బురద జల్లుడు కార్యక్రమం చేయకూడదని హితవు పలికారు.

హఠాత్తుగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు మద్దతు పలుకడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2014 నాటికి తెలంగాణా నాది... సీమాంధ్ర నీది అనే ఫార్ములాతో వీరిద్దరూ ముందుకు వస్తారన్న ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లయ్యింది.

T.R.S

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us