18 April 2011

వైఎస్.జగన్ ఓ దోపిడీ దొంగ: జయప్రకాష్ నారాయణ్

కడప ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఒక దోపిడీ దొంగతో పోల్చారు. ఈ ఎన్నికల్లో ఒక దోపిడీ దొంగను ఎన్నుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆ సెగ్మెంట్ ప్రజలకు పట్టిందన్నారు. రాజకీయ పార్టీలు అన్నీ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నాయని ఆరోపించారు. పాలనలో దోచుకున్న డబ్బులను మళ్లీ ఎన్నికలలో గెలవడానికి ఖర్చు పెడుతున్నాయని, ఎన్నికల్లో గెలిచి మళ్లీ కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు సుమారు రూ.200 కోట్లను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దోపిడీదారులను ఎన్నుకోవడం మినహా మరో అవకాశం ఓటర్లకు కనిపించడం లేదన్నారు.

Loksatta

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us