21 April 2011

రాష్ట్ర రాక్షసుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి: రేవంత్ రెడ్డి



కడప ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ యువ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాక్షసుడుతో పోల్చాడు. ఇలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన సూచించారు.

కడప ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2009 వరకు రాష్ట్రాన్ని వైఎస్ఆర్ అనే ఒక పెద్ద రాక్షసి పట్టి పీడించిందన్నారు. ప్రస్తుతం అదే కోవలో పిల్ల రాక్షసి జగన్ పట్టి పీడిస్తున్నాడని దుయ్యబట్టారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న సతీష్ రెడ్డి తాత దయతో యుఫ్పై ఏళ్ళ క్రితం వైఎస్‌ను రాజకీయాల్లోకి వచ్చారన్నారు. గతాన్ని మరిచిపోయిన వైఎస్ఆర్ కుటుంబం తమ స్వార్థమే పరమావధిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు.

T.D.P, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us