20 April 2011

వైఎస్సార్ ఫోటో కాంగ్రెస్ పార్టీకే సొంతం: మంత్రి ఆనం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. అందుచేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సొంతమని, ఆయన ఫోటో కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆనం వ్యాఖ్యానించారు.
కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిపెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆనం వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పోటీలో ఉన్నారని ఆనం గుర్తుచేశారు. పార్టీని సమన్వయం చేస్తూ ప్రతి నాయకున్ని, కార్యకర్తలను కలుస్తామన్నారు.

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us