20 April 2011

డీఎల్ రవీంద్రారెడ్డి చరిత్ర హీనుడు: భూమా నాగిరెడ్డి

కడప లోక్ సభకు పోటీ చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చరిత్ర హీనుడని మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. మొన్నటి వరకు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి పంచన వుండి, మరణించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని భూమా చెప్పారు.
డీఎల్ రవీంద్రారెడ్డిని నైతిక విలువలు తెలియవని భూమా విమర్శించారు. డీఎల్ రవీంద్రారెడ్డి రోజుకో మాట మారుస్తున్నాడని, బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మ డీలర్ల దగ్గక రూ. ఐదువేలు డబ్బులు తీసుకుని విమర్శించిన డీఎల్ ప్రస్తుతం ఆమెను వెంటపెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అధిష్టానం ఢిల్లీలో వుంటే జగన్‌కు అధిష్ఠానం ప్రజలేనన్నారు.

YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us