06 April 2011

అభిమానానికి.. అహంకారానికి మధ్య జరిగే సమరం: జగన్

కడప, పులివెందుల ఉప ఎన్నికలు దివంగత మహానేత వైఎస్ఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానానికి, అధికార కాంగ్రెస్ అహంకారానికి మధ్య సమరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు.

కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న ఆయన బుధవారం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్‌పై ఉన్న అభిమానానికి, అధికార అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు.

పేదల అభ్యున్నతికి కృషి చేసింది మొదట ఎన్టీఆర్, తర్వాత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి వేసే ప్రతి ఓటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతాయన్నారు.

ఈ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పుకు నాంది పలుకుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని జగన్ ఆరోపించారు.

Congress, Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us