21 April 2011

ఆత్మ గౌరవానికి, అహంకారానికి జరిగే యుద్ధం: జగన్


కడప, పులివెందుల ఉప ఎన్నికలు వైఎస్ఆర్ ఆత్మగౌరవానికి, కాంగ్రెస్ పార్టీ దుర అహంకారానికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ప్రజలందరూ ఒక వైపు అయితే నేతలు మాత్రమే మరో వైపు నిలిచి తల్లి, కొడుకులపై దండెత్తుతున్నారన్నారు.ప్రస్తుత ఎన్నికల రణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య కాదన్నారు. ఈ ఎన్నికలు ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, విశ్వసనీయతకు, వంచనకు, ఆత్మ గౌరవానికి, అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా పేర్కొన్నారు.
ఈ యుద్ధంలో మీరందరూ తనకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, నాయకులు, అభిమానులు 6500 మంది పైన బైండోవర్ కేసులు పెట్టించి గ్రామాలలో భయాందోళనలు సృష్టిస్తూ తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు

Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us