|
|
మే-జూన్లో తెలంగాణ కచ్చితంగా వస్తుంది. నిజంగా అదే జరిగితే తెలంగాణలో జగన్ హీరో అయిపోతాడు. జగన్కే ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది. మాకు లేదు’- ఇది వైఎస్సార్ కాంగ్రెస్ నేత ప్రకటన అనుకుంటే తప్పులో కాలేసినట్లే. టీడీపీలో ఎన్నో పదవులు పొందిన సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అయితే దీనిని రాయవద్దని మళ్లీ ఆయనే కోరడం కొసమెరుపు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్ ప్రచారం ప్రారంభించే ముం దు తెలంగాణ టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేతకు ఫోన్ చేసి, తనను ఆశీర్వదించాల్సిందిగా కోరారం టూ ‘సూర్య’లో వచ్చిన వార్తా కథనం చర్చనీయాంశమైన నేపథ్యంలో నాగం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.హటాత్తుగా నాగం అసలు ఇంతవరకూ తెలంగాణపై స్పష్టత ప్రకటించిన జగన్ హీరో అవుతారని, తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించిన టీడీపీకి క్రెడిబిలిటీ లేదని వ్యాఖ్యానించడం విశేషం. శుక్రవారం టీడీఎల్పీ వద్ద మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడిన నాగం తెలంగాణ రావడం ఖాయమని, తెలంగాణలో జగన్ హీరో అవుతారని వ్యాఖ్యానించి అందరినీ విస్మ యపరిచారు. అయితే, జగన్ సమైక్యాంధ్రకు మద్ద తుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన విషయాన్ని మీడియా ప్రతినిధులు గుర్తు చేసి, ఆయనకు క్రెడిబి లిటీ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘అయినా సరే జగన్కే తెలంగాణలో క్రెడిబిలిటీ ఉంది. తెలంగా ణపై స్పష్టత లేదు కాబట్టి మాకు అది లేదు’ అన్నారాయన.
see more in www.Suryaa.com
0 comments:
Post a Comment