15 April 2011

వైఎస్‌ బొమ్మకు జగన్‌ వారసుడు కాదు

dssirదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బొమ్మను వాడుకునే అర్హత జగన్‌కు లేదని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అన్నారు. వైఎస్సార్‌కు నిజమైన రాజకీయ వారసుడు వైఎస్‌ వివేకానందరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులు వెళ్ళడం కొత్తేమి కాదని, గతంలో కూడా మంత్రులు ప్రచారం చేశారన్నారు. తనకు, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డితో విభేధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కడప ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదని, సాధారణ ఎన్నికల మాదిరిగానే ట్రీట్‌ చేస్తున్నామని డిఎస్‌ స్పష్టం చేశారు.
కడప ఉప ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నదని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఊహించని రీతిలో ఈ ఎన్నికల్లో పనిచేస్తున్నారని, సాధారణ ఎన్నికల మాదిరిగా భావించి చాలా చాకచక్యంగా, ఉత్తేజంతో పార్టీ శ్రేణులు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ మళ్ళీ కాంగ్రెస్‌లో వచ్చారా? అని అడిగిన ప్రశ్నకు డిఎస్‌ స్పందిస్తూ వాస్తవంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే, పార్టీలో మళ్ళీ వచ్చారా? అనడం సరికాదు, ఆమె మా పార్టీతోనే ఉన్నారని సమాధానం ఇచ్చారు. కడపలో ఇప్పటికీ కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ వెంట పాల్గొంటున్న విషయాన్ని డిఎస్‌ దృష్టికి తీసుకురాగా అలాంటి వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి, ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పడం జరిగింది, సిఎంతో ఈ విషయమై మాట్లాడుతున్నా, తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన చెప్పారు.
తనకు, సిఎంతో విభేదాలున్నట్లు ఏదో ఒక ప్రతిక రాసినంత మాత్రానా నిజమనుకోవడం సరికాదని మరో ప్రశ్నకు సమాధానంగా డిఎస్‌ స్పష్టం చేశారు. కడప ఉప ఎన్నికల్లో పార్టీకి చెందిన్న అన్ని ఆంశాలపై స్థానిక నేతలతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నామని, కడప నేతలు చెప్పిందే విన్నామని, వాళ్ళ నిర్ణయమే తమ నిర్ణయంగా ప్రకటించామని, కడప లోక్‌సభకు, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మంత్రులు డిఎల్‌, వివేకాలను స్థానిక నేతల అభిప్రాయాల మేరకే ఎంపిక చేసినట్లు డిఎస్‌ వెల్లడించారు.
see more in www.Suryaa.com

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us