27 March 2011

బాబు ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చా...


pocharam టిడిపి అధినేత చంద్ర బాబు ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగా నని ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇటీవలే రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ లాబీల్లోని తెలుగుదేశం పార్టీ శానససభాపక్షం కార్యాల యంలోకి ఆయన వచ్చారు. దారి తప్పి వచ్చినట్లున్నా రూ..! అంటూ విలేకరులు ఆయన్ను పలకరించారు. దీనికి ఆయన బదులిస్తూ తాను ప్రత్యేక పరిస్థితుల్లోనే పార్టీని వీడిపోయానన్నా రు. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే తాను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ స్థాయికి ఎదిగానన్నారు. తెలంగాణ విషయంలో ప్రజల్లో బలమైన సెంటిమెంట్‌ వచ్చిందని, కనీసం నియోజకవర్గంలో ప్రజల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.    courtesy ---surya

T.D.P, T.R.S

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us