|
లోక్ పాల్ సంయుక్త కమిటీ నుంచి అన్నాహజారే , ఇతర పౌర సమాజ సభ్యులు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. రాందేవ్ బాబా అరెస్టుకు నిరసగా వారీ చర్యకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.దీనితో లోక్ పాల్ బిల్లు వ్యవహారం గందరగోళంలో పడే అవకాశం ఉంది.కాగా తనపట్ల ఢిల్లీలో పోలీసులు వ్యవహరించిన తీరుపై యోగా గురువు రాందేవ్ బాబా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తనను అరెస్టు చేసి హరిద్వార్ కు తీసుకు వెళ్లడంపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు.తనను అరెస్టు చేసే సమయంలో మహిళలను, పిల్లలను విచక్షణారహితంగా పోలీసులు లాఠీ ఛార్జీ చేశారని ఆయన ఆరోపించారు. అనేక మంది తన మద్దతుదారులు గల్లంతయ్యారని ఆయన ఆరోపించారు.తనను చంపేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.సరిగ్గా ఇదే పాయింటును ఢిల్లీ పోలీసులు తమ వాదనలో వినిపించారు. రామ్ దేవ్ బాబాకు భద్రత కరువైందని, కొంతమంది ఆయనను చంపడానికి చూస్తున్నారని, అందువల్లనే అక్కడ భద్రత అంతగా లేనందున ఆయనను అరెస్టు చేయవలసి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చారు.
see more in http://kommineni.info
- ట్రస్ట్ సభ్యులని అరెస్ట్ చెయ్యాలి
- అసలు ఊహించలేదు ..నా ఆనందాన్ని వర్ణించలేను
- ఆగస్టు 16 నుంచి తిరిగి దీక్ష ప్రారంభం : అన్నా హజారే
- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్పాల్ బిల్లు
- అన్నా హజారే రాజీనామా
- దీక్ష ఆగలేదు ...ఆగబోదు : రామ్దేవ్ బాబా
- సోనియా గాంధీ సమాధాన లేఖపై అన్నా హజారే హర్షం!
- తింటే తినండి లేకుంటే చావండి:యు.పీ.ఎ ( వంటగ్యాస్పై 50 రూపాయలు పెంపు)
- ఎ.పీ స్పెషల్ ... బురద చల్లుడు రాజకీయాలు
- జగన్కు -రత్నాకర్కు లింకు ఏంటి?
0 comments:
Post a Comment