18 April 2011

వై.ఎస్. జగన్ గెలిచినా ఒరిగేదేమీ లేదు: మంత్రి కన్నా

ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండరని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు అభ్యర్థిగా గెలిచినా చేసేది ఏమీ లేదని కన్నా విమర్శించారు.

ఉప ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకున్నప్పటికీ, ఆయన వ్యాపారాలే చూసుకుంటారని కన్నా ఆరోపించారు. అలాంటి వ్యక్తి వల్ల ప్రజలకు వచ్చే ఒరిగేదేమీ లేదని కన్నా వ్యాఖ్యానించారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని గెలిపించాలని మంత్రి కన్నా ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బాటలోనే తాము నడుస్తున్నామని కన్నా చెప్పారు. ఏ చిన్న ఆరోపణలకైనా విచారణ జరిపించే వారని కన్నా అన్నారు.

వైఎస్సార్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయడంలో తప్పులేదన్నారు. వైఎస్ వల్లే కాంగ్రెస్ గద్దెక్కలేదని, కాంగ్రెస్ చలువతోనే వైఎస్సార్ అంతెత్తుకు ఎదిగారని మంత్రి వ్యాఖ్యానించారు.

Congress, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us